constitutional amendments in Telugu
రాజ్యాంగ సవరణలు – ముఖ్యాంశాలు
రాజ్యాంగ సవరణ 26 to 50
26 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1971 డిసెంబర్ 28న అమలులోకి వచ్చింది. ఈ సవరణలను ఇందిరాగాంధీ
చేయడం జరిగింది. ఇందిరాగాంధీ దేశంలోని
ప్రజలు అందరూ సమానం కావున రాజవంశస్థులకి రాజభరణాల ప్రత్యేక సదుపాయాలు రద్దు చేశారు.
27వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1972 ఫిబ్రవరి 15న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం ఈశాన్య
రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు 371c ప్రకారం మణిపూర్
రాష్ట్రానికి మంత్రిమండలి, అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది.
28 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1972 ఆగస్టు 29న అమలు చేయడం జరిగింది. ఈ సవరణ ప్రకారం మాజీ
ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు హోదా, హక్కులను హక్కులను తొలగించారు.
29 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1972 జూన్ 9న అమలులోకి వచ్చింది.
·
దీని ప్రకారం 9వ షెడ్యూల్లో కేరళ రాష్ట్రం యొక్క భూసంస్కరణలు
చేర్చారు.
30 వ రాజ్యాంగ సవరణ
·
ఈ రాజ్యాంగ సవరణ 1973 ఫిబ్రవరి 27న అమలులోకి వచ్చింది. దీని ప్రకారం సుప్రీం కోర్టుకు అప్పిలుకు
వెళ్లడానికి ఉన్న పరిమితి 20 వేల రూపాయలను తొలగించారు.
31 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1973 అక్టోబర్ 17న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం 525 ఉన్న లోక్సభ సీట్లను 545 పెంచారు.
కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికయ్యే వారి సంఖ్యను 25 నుండి 20 కి తగ్గించారు.
32 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1974 జూలై 1న అమలులోకి వచ్చింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్
లో విద్యా ఉద్యోగాలలో ఆరు సూత్రాల పథకాన్ని చేర్చారు.
అంతేకాకుండా హైదరాబాద్ లో సెంట్రల్
యూనివర్సిటీ ఏర్పాటు చేశారు.
33 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1974 మే 19న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం సభాధ్యక్షుడు పార్లమెంటు మరియు శాసనసభ్యుల
రాజీనామా పత్రాన్ని తప్పనిసరిగా ఆమోదించాలి అనే నిబంధనను తొలగించారు. స్పీకర్
స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నానని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే రాజీనామాను ఆమోదించవచ్చు.
34 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1974 సెప్టెంబర్ 7న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం 9వ షెడ్యూల్
యొక్క అధికార పరిధిని పెంచారు.
35 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1975 మార్చి 1 నుండి అమలులోకి వచ్చింది. సిక్కింకి రాష్ట్ర హోదా కల్పిస్తూ 10 వ షెడ్యూల్ ను కొత్తగా చేర్చారు.
36వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1975 ఏప్రిల్ 26వ తేదీ నుండి
అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం సిక్కిం
ప్రాంతానికి పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రతిపత్తి కల్పించి 22వ రాష్ట్రంగా ఏర్పాటు
చేయడం జరిగింది. 10 వ షెడ్యూల్ నీ తొలగించడం జరిగింది.
37 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1975 మే 3న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం కేంద్ర
పాలిత ప్రాంతం అయిన అరుణాచల్ ప్రదేశ్ కి శాసనసభకు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే
అవకాశం కల్పించారు.
38 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1975 ఆగస్టు 1న అమలులోకి వచ్చింది ఈ సవరణ ప్రకారం గవర్నర్, రాష్ట్రపతి
జారీ చేసిన ఆర్డినెన్సు కోర్టుల అధికార పరిధిలోకి
రావని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితినీ కోర్టుల అధికార పరిధి నుండి తప్పించారు.
39 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1975 ఆగస్టు 10న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి,
లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన అంశాలు న్యాయ సమీక్ష పరిధిలోకి రావు. ఈ సవరణలు ద్వారా 9 వ షెడ్యూల్ లో నూతన చట్టాలను
కలవడం జరిగింది.
40 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1976 మే 27న అమలులోకి వచ్చింది. భారతదేశ అధికార పరిధిలో ఉన్న భౌగోళిక జలాలపై
భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది అంతేకాకుండా చట్టాలు చేసే అధికారం ఉంది.
41 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1976 సెప్టెంబర్ 7న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం రాష్ట్ర
పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మొదలైనవారి సభ్యుల
పదవీ విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచారు.
42వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1977 ఏప్రిల్ 30 న అమలులోకి వచ్చింది. ఈ సవరణలో ప్రాథమిక
హక్కుల కన్నా ఆదేశిక సూత్రాలకి అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చారు.
·
ప్రవేశికను
సవరించి లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే
పదాలను చేర్చారు. రాష్ట్రపతి పాలనను ఆరు నెలల నుండి ఒక సంవత్సరానికి పొడిగించారు.
·
లోక్సభ అసెంబ్లీ
సీట్లలో 2001 వరకు మార్పు లేకుండా చేశారు. అత్యవసర పరిస్థితి 352 సవరించి ఏ ప్రాంతానికైనా విధించేలా మార్పు తెచ్చారు.
·
ఆర్టికల్ 312 సవరించి అఖిల భారత న్యాయ సర్వీస్
కమిషన్ నియామకం చేపట్టారు. ఆర్టికల్ 368 కింద ఏ కోర్టులో పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణ
ప్రశ్నించకూడదు అని చెప్పారు.
·
కేంద్ర సాయుధ దళాలను కేంద్ర ప్రభుత్వం ఏ
రాష్ట్రానికైనా పంపించే అధికారంతో పాటు రాష్ట్రాల శాంతిభద్రతలను పర్యవేక్షించడం
కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
·
అడవుల పరిరక్షణ,
తూనికలు,
విద్య, కొలతలు, జనాభా నియంత్రణ, న్యాయ పరిపాలన లాంటి అంశాలను ఉమ్మడి జాబితాకు
మార్చడం జరిగింది.
·
ఆర్టికల్ 74(1) సవరించి
కేబినెట్ సలహాను రాష్ట్రపతి తప్పకుండా పాటించాలని పేర్కొనడం జరిగింది.
·
ప్రాథమిక విధులను 4(a) భాగంలో 51(A) ప్రకారణగా చేర్చారు.
నూతనంగా కింది ఆదేశిక సూత్రాలను ప్రవేశపెట్టారు
·
ఆర్టికల్ 39(a) ప్రకారం సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సలహాలు.
·
యాజమాన్యంలో స్థానికులకు భాగస్వామ్యం కల్పించడం.
·
పర్యావరణ వన్య ప్రాణుల సంరక్షణ48(a)
43వ రాజ్యాంగ సవరణ
·
1978 ఏప్రిల్ 13న ఈ సవరణ అమలు లోకి
వచ్చింది. ఈ సవరణ ప్రకారం న్యాయసమీక్ష సిద్ధాంతాన్ని తిరిగి న్యాయస్థానాలకు
కల్పించడం జరిగింది. ఏదైనా ఒక సంస్థ జాతి వ్యతిరేక సంస్థ అని
నిర్ణయించేందుకు గల అధికారాన్ని పార్లమెంటు తిరిగి తీసుకుంది.
44వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1979 సెప్టెంబర్ 6న అమలులోకి
వచ్చింది. ఈ సవరణ ద్వారా 6 సంవత్సరాలు గల లోక్ సభ, శాసన సభ్యుల పదవీకాలం
5 సంవత్సరాలకు తగ్గించారు.
·
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీం కోర్టు
నిర్ణయిస్తుంది.
·
అస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు.
·
పార్లమెంట్, శాసన సభ్యుల ఎన్నికల వివాదాలను హైకోర్టు
నిర్వహిస్తుంది.
·
పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించారు, కేంద్ర మంత్రి మండలి
లిఖితపూర్వక సలహా లేనిదే జాతీయ అత్యవసర పరిస్థితి విధించరాదు.
·
పార్లమెంట్ సభ్యుల,
శాసనసభ సభ్యుల సభ్యత్వం విషయాలపై రాష్ట్రపతి, గవర్నర్ దే అంతిమ నిర్ణయం.
·
ప్రాథమిక హక్కులు
అయినా ఆర్టికల్ 20, 21 జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రద్దు కావు.
45 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1980 జనవరి 25న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం పార్లమెంట్
మరియు శాసనసభ లో ఎస్సీ, ఎస్టీలు మరియు
ఆంగ్లో ఇండియన్ లకు రిజర్వేషన్లను మరో పది సంవత్సరాలు పొడిగించారు.
46 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1983 ఫిబ్రవరి 2న అమలులోకి వచ్చింది దీని ప్రకారం అంతర్
రాష్ట్రాల మధ్య విధించే వాణిజ్య పన్నులు రాష్ట్రాలకు బదలాయించారు.
47 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1984
ఆగస్టు 26న అమల్లోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం 9వ షెడ్యూల్లో భూ సంస్కరణలకు
సంబంధించిన 14 కొత్త చట్టాలను చేర్చారు.
48 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1984 ఆగస్టు 26న అమల్లోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం పంజాబ్లో
రాష్ట్రపతి పాలనను పొడిగించారు.
49 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1984 సెప్టెంబర్ 11న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం
త్రిపురలోని గిరిజన ప్రాంతాల్లో పరిపాలనపై ఆ రాష్ట్ర శాసనసభకు చట్టాలు చేసే
అధికారం ఉంటుంది.
50 వ రాజ్యాంగ సవరణ
·
ఈ సవరణ 1984 సెప్టెంబర్ 11న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం సాయుధ
బలగాలకు ప్రాథమిక హక్కుల పై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.
ALSO READ:- constitutional amendments in Telugu 01 to 25
ALSO READ:- constitutional amendments in Telugu 26 to 50
No comments:
Post a Comment