constitutional amendments in Telugu 81-105
రాజ్యాంగ సవరణలు – ముఖ్యాంశాలు
రాజ్యాంగ సవరణ 81 to 105
81 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2000 జూన్ 9న అమలులోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు
సంబంధించిన ఖాళీలు ఆ సంవత్సరంలో భర్తీ ప్రక్రియ పూర్తి కాకపోతే వాటిని
ప్రత్యేక కాళీలుగా పరిగణించి ఆ వర్గాలతో
మాత్రమే భర్తీ చేయాలి. దీని ద్వారా 50 శాతం కంటె రిజర్వేషన్లు మించిన చెల్లుబాటు అవుతాయి.
82 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2000 సెప్టెంబర్ 8న
అమలులోకి వచ్చింది. ఈ సవరణలో విద్యా,ఉద్యోగాలలో ఎస్సీ,
ఎస్టీలకు సంబంధించిన అర్హత మార్కులను ఇతర మార్పులను తగ్గించవచ్చు.
83 వ రాజ్యాంగ సవరణ
ఇది 2000 సెప్టెంబర్ 8న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ద్వారా అరుణాచల్
ప్రదేశ్ పంచాయతీలలో ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు.
84 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2002 ఫిబ్రవరి 21 అమలులోకి వచ్చింది. ఈ సవరణ ద్వారా లోక్ సభ
మరియు రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన 2026 వరకు పొడిగింపు మరియు
స్థిరీకరణ 1991 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన.
85 వ రాజ్యాంగ సవరణ
ఇది 2002 జనవరి 4న అమలులోకి వచ్చింది. ఈ సవరణలు ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో
రిజర్వేషన్లు విషయంలో కన్వీనెన్స్ సూత్రం వర్తింప చేశారు.
అయితే ఈ సూత్రం 1995 జూన్ 17 నుండి అమలు.
86 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2002 డిసెంబర్ 12న అమలులోకి వచ్చింది. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత
నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలి. 45వ ఆర్టికల్ లో 6 సంవత్సరాలలోపు బాలలకు పూర్వ
ప్రాథమిక విద్యను అందించాలి. ప్రాథమిక విధుల్లో 11 వ విధిగా 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలలకు
ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల లేదా సంరక్షకుని బాధ్యత.
87 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2003 జూన్ 22న అమలులోకి వచ్చింది. ప్రాదేశిక నియోజకవర్గాల
పునర్ వ్యవస్థీకరణ విషయంలో 1991 జనాభా లెక్కలకు బదులుగా 2001 జనాభా లెక్కలను
పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
88 వ రాజ్యాంగ సవరణ
ఇది 2004 ఫిబ్రవరి 19న అమలులోకి వచ్చింది. ఈ సవరణలో సర్వీస్ టాక్స్ లను ప్రవేశపెట్టింది. అయితే ఈ
టాక్స్ లను కేంద్రం విధిస్తుంది, కేంద్ర రాష్ట్రాలు వసూలుచేసి తీసుకుంటాయి.
89 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2003 సెప్టెంబర్ 28 న
అమలులోకి వచ్చింది. ఈ సవరణలో ఎస్.టి. లకు ప్రత్యేక
జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
90వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2003 సెప్టెంబర్ 28న అమలులోకి వచ్చింది ఈ సవరణలో అసోం రాష్ట్ర
శాసనసభలో బోడోల్యాండ్ ప్రాంతానికి
ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు.
91 వ రాజ్యాంగ సవరణ
·
ఇది 2004 జనవరి 1న అమలులోకి వచ్చింది. కేంద్ర మంత్రిమండలి సంఖ్య
లోక్ సభ లో మొత్తం సభ్యుల లో 15 శాతానికి మించరాదు.
·
రాష్ట్ర మంత్రి మండలి సంఖ్య రాష్ట్రం మొత్తం
శాసనసభ సభ్యులలో 15 శాతానికి మించి రాదు కానీ కనీస సభ్యుల సంఖ్య 12 కు తాగ్గకూడదు.
·
పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులు 2 సంవత్సరాల వరకు
ఎలాంటి పదవులు చేపట్టారు. అయితే పార్టీ ఫిరాయింపు చట్టానికి మినహాయింపుగా ఉన్న చీలిక అనే అంశాన్ని తొలగించారు.
92 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2004 జనవరి 7న అమలులోకి వచ్చింది. ఈ సవరణలో 8వ షెడ్యూల్లో బోడో,
డోగ్రో, మైథిలి మరియు సంతాలి అనే భాషలను చేర్చారు.
93 వ రాజ్యాంగ సవరణ
ఇది 2006 జనవరి 20న అమలులోకి వచ్చింది. సామాజికంగా విద్యాపరంగా
వెనుకబడిన తరగతులకు విద్యా సంస్థలలో ప్రవేశానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించడం జరిగింది.
94 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2006 జూన్ 12న అమలులోకి
వచ్చింది. బీహార్ ప్రభుత్వంలో
షెడ్యూల్ తెగల సంక్షేమానికి తప్పనిసరిగా మంత్రి ఉండాలి అనే నిబంధనను తొలగించారు. జార్ఖండ్,
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు తప్పనిసరి చేశారు.
95 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2010 జనవరి 25న అమలులోకి వచ్చింది. పార్లమెంట్ మరియు శాసనసభ
లో ఎస్సీ, ఎస్టీలు మరియు ఆంగ్లో ఇండియన్ లకు రిజర్వేషన్లను 2020 సంవత్సరం వరకు పొడిగించారు.
96 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2011 సెప్టెంబర్ 23న అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం ఒరియా భాషను
ఒడియాగా మార్చారు.
97వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2012 ఫిబ్రవరి 15న అమలులోకి వచ్చింది. సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదాను కల్పించారు.
98 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2013 జనవరి 1న అమలులోకి వచ్చింది. కర్ణాటక ప్రాంతంలోని గుల్బర్గా, రాయచూర్, బీదర్,కొప్పెల్, బళ్ళారి ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి.
99వ రాజ్యాంగ సవరణ
ఇది 2015 ఏప్రిల్ 14 నుండి అమలులోకి వచ్చింది. ఈ సవరణ ప్రకారం జాతీయ న్యాయ నియామకాల
కమిషన్ ఏర్పాటు చేశారు.
100 వ రాజ్యాంగ సవరణ
భారత్, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు ఒప్పందం పశ్చిమబెంగాల్,
త్రిపుర సరిహద్దులు మారాయి
101 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2016 సెప్టెంబర్ నుండి అమలులోకి వచ్చింది.గూడ్స్ సర్వీస్ టాక్స్ ని(GST) అమలు చేయడం.
102 వ రాజ్యాంగ సవరణ
ఇది వెనుకబడిన కులాల కమిషన్ కి సంబంధించింది.
103 వ రాజ్యాంగ సవరణ
ఇది 2019 జనవరి 14 న అమలులోకి వచ్చింది. ఇది అగ్రవర్ణాల కి 10% రిజర్వేషన్లు కల్పించడం గురించి ఉద్దేశించబడింది.
104 వ రాజ్యాంగ సవరణ
ఇది 2020 లో అమలులోకి
వచ్చింది లోక్ సభ మరియు శాసనసభలో ఎస్సీ,ఎస్టీ
రిజర్వేషన్లు పొడిగించారు కానీ ఈ రిజర్వేషన్లను
ఆంగ్లో ఇండియన్ లకి వర్తించదు.
105 వ రాజ్యాంగ సవరణ
ఈ సవరణ 2021 ఆగస్టులో అమలులోకి వచ్చింది. రాష్ట్రాలు తమ సొంత OBC జాబితాను
రూపొందించుకోవడానికి అధికారాన్ని పునరుద్ధరించారు.
ALSO READ:- constitutional amendments in Telugu 26 to 50
No comments:
Post a Comment