భారతప్రధాన
మంత్రుల వరుస క్రమం
List of prime ministers of India
1. జవహర్లాల్ నెహ్రూ(15-august-1947 - 27-may-1964)
·
ఇతను ఆధునిక నవభారత నిర్మాత. భారతదేశంలో అత్యధిక కాలం 16 సంవత్సరాల 286
రోజులు ప్రధానమంత్రిగా పరిపాలన చేశాడు.
·
ప్రణాళికాబద్ధమైన
ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు. భారతదేశంలో ప్రజాస్వామ్య సామ్యవాదం ప్రవేశపెట్టాడు.
·
భారత విదేశాంగ
విధానం రూపశిల్పిగా పేర్కొంటారు.
·
ఇతను 1956లో
పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టారు. 1954లో పంచశీల ఒప్పందం పై
సంతకం చేశాడు.
·
అలీన ఉద్యమ
నిర్మాణంలో ఇతను ఒకడు. ఇతనికి 1955లో భారతరత్న
అవార్డు లభించింది.
·
పదవిలో ఉండగా
మరణించిన తొలి ప్రధాని. ఎర్రకోటపై
అత్యధికంగా 17 సార్లు జాతీయ జెండాను ఎగుర వేశాడు.
2. గుల్జారీలాల్ నందా(25-may-1964-9-june-1964)
·
ఇతను పంజాబ్ రాష్ట్రంలో సియల్ కోట్
అనే ప్రదేశంలో జన్మించాడు. ప్రస్తుతము ఇది పాకిస్తాన్ లో ఉంది.
·
మొదటి తాత్కాలిక ప్రధాని. ఇతనికి మరణం తర్వాత అంతే 1997లో భారతరత్న అవార్డు
లభించింది.
3. లాల్
బహదూర్ శాస్త్రి (1964-1966)
·
ఇతను “జై జవాన్ జై కిసాన్” అనే నినాదాన్ని ఇచ్చాడు. 1965లో పాకిస్తాన్ తో జరిగిన
యుద్ధాన్ని ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.
·
పాకిస్తాన్
అధ్యక్షుడు అయిన అయుబ్ ఖాన్ తో
తాష్కెంట్ ఒప్పందంపై
1966 లో సంతకాలు చేయించాడు.
·
విదేశీ పర్యటనలో మరణించిన ప్రధానమంత్రి మరియు పదవిలో ఉండగా మరణించిన
రెండవ ప్రధాని ఇతను.
·
తాష్కెంట్
ఒప్పందం మరుసటిరోజే మరణించాడు ఇతనికి 1966లో మరణం తర్వాత భారతరత్న అవార్డు లభించింది.
·
మరణం అనంతరం భారతరత్నఅవార్డు
పొందిన మొదటి వ్యక్తి.
· ఇతని సమాధిని “విజయ్ ఘాట్” అని అంటారు.
4. గుల్జారీలాల్ నందా(11 January 1966- 24 January 1966)
· తాత్కాలిక ప్రధాని
5. శ్రీమతి ఇందిరాగాంధీ(24 January 1966- 24 March 1977)
·
భారతదేశానికి
అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తి ఈమె.
·
1971లో మొదటి
మధ్యంతర ఎన్నికలు నిర్వహించింది.
·
1969లో
మొదటిసారిగా 14 బ్యాంకులను జాతీయం చేసింది. 1970లో రాజభరణాలు
రద్దు చేసింది.
·
1971లో “గరీబీ హటావో” నినాదాన్ని ఇచ్చారు. భారతదేశంలో అత్యధిక సార్లు
అత్యవసర పరిస్థితులు వీరి కాలంలోనే విధించడం జరిగింది.
·
భారత రాజ్యాంగంలో
అధిక సవరణలు వీరి కాలంలోనే జరిగాయి. మొదటిసారి అణు పరీక్షలు ప్రొఖ్రాన్ లో1974లో నిర్వహించారు.
·
జాతీయ అంతరంగిక
అత్యవసర పరిస్థితి 1975లో విధించారు. జాతీయ ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అవకతవకలపై
ఇందిరాగాంధీ అరెస్ట్ కాబడ్డారు.
·
ప్రధానమంత్రి
పదవిలో ఉండి పార్లమెంట్ సభ్యురాలిగా ఓడిపోయిన మొదటి వ్యక్తి ఈమె.
·
1971లో అప్పటి అగ్రరాజ్యమైన రష్యాతో 20 సంవత్సరాల శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.
·
రాజ్యసభ సభ్యులుగా ఉంది ప్రధానమంత్రి పదవిని
చేపట్టే మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ.
·
42 వ రాజ్యాంగ సవరణ(మిని
రాజ్యాంగము) ఇందిరాగాంధీ
కాలంలోనే చేశారు.
·
జనతా పార్టీకి
చెందిన రాజ్ నారాయణ గురు అనే వ్యక్తి
చేతిలో రాయ్ బరేలి నియోజకవర్గం నుండి మొదటిసారి ఒక ప్రధానమంత్రి అయినా ఇందిరాగాంధీ
ఓడిపోవడం జరిగింది.
·
ఇందిరా గాంధీ
యొక్క సమాధి పేరు “శక్తిస్థల్”. ఇందిరా గాంధీ అనర్హతకు సంబంధించి విచారించిన
న్యాయమూర్తి జస్టిస్ v.r. కృష్ణ అయ్యార్.
·
ఇందిరా గాంధీ 1971లో
భారతరత్న అవార్డు పొందింది మరియు భారతరత్న
అవార్డు పొందిన తొలి మహిళ.
· 1972లో చారిత్రాత్మకమైన సిమ్లా ఒప్పందం అప్పటి పాకిస్తాన్ ప్రధాని అయిన జుల్ఫికర్ అలీతో కుదుర్చుకున్నారు.
6. మురార్జీ దేశాయ్(24 March 1977- 28 July 1979)
·
ఇతను మొట్టమొదటి
కాంగ్రెసేతర ప్రధానమంత్రి మరియు మొదటి
సారి రాజీనామా చేసిన ప్రధాని.
·
మురార్జీ దేశాయ్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.
·
మొదట భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలకు ఇతను నేతృత్వం
వహించాడు.
·
భారత పార్లమెంట్ లో అత్యధికంగా తొమ్మిది సార్లు
బడ్జెట్ను ప్రవేశ పెట్టాడు. నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టాడు.
·
ముఖ్యమంత్రి పదవి
నిర్వహించి ప్రధాని అయిన మొదటి వ్యక్తి ఇతను.
·
పాకిస్తాన్ ఇచ్చే
ప్రముఖ పురస్కారం అయినా నిషన్-ఈ-పాకిస్తాన్ పొందిన తొలి భారతీయుడు.
· ఇతనికి 1991లో భారతరత్న అవార్డు లభించింది. ఇతని కాలంలో ఏకకాలంలో ఇద్దరు ఉప ప్రధానులను కలిగి ఉన్న ప్రధానమంత్రి ఇతను.
7. చరణ్ సింగ్(28 July 1979- 14 January 1980)
·
ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. పార్లమెంటులో ఎదుర్కోకుండానే రాజీనామా చేసిన
ప్రధాని .
·
23 రోజులు
ప్రధానమంత్రిగా పని చేయగా ఆపద్దర్మ ప్రధానమంత్రిగా 4 నెలలు పని చేశాడు.
· ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి ఆయన రెండవ వ్యక్తి ఇతను. రైతు బాంధవుడు అని పేరు పొందాడు.
8. ఇందిరాగాంధీ(14 January 1980- 31 October 1984)
9. రాజీవ్ గాంధీ(31 October 1984- 2 December 1989)
·
అతి చిన్న వయసులో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు
ప్రధానమంత్రి చేపట్టే సమయంలో అతని వయసు 42 సంవత్సరాలు.
·
కేంద్ర మంత్రి
మండలి అత్యధికంగా 13 సార్లు పునర్వ్యవస్థీకరించారు. ఇండియాలో సాంకేతిక విప్లవానికి
పునాదులు వేశారు
·
1986లో నూతన
విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. శ్యామ్ పిట్రోడాతో
కలిసి ఐటీ రంగంలో ఎన్నో విప్లవాలకు పునాదులు వేశాడు.
·
21 సంవత్సరాలు
ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించాడు. ఇతను
పార్టీ ఫిరాయింపు నిరోధకచట్టాన్ని
తీసుకు వచ్చాడు.
·
ఆఫ్రికా
ఫండ్ ని ఏర్పాటు చేశాడు. ఇతని మరణం తర్వాత 1991లో భారతరత్న అవార్డు
లభించింది.
· ఇతని సమాధి పేరు “వీర భూమి”
10. విశ్వ నాథ్ ప్రతాప్ సింగ్ (2 December 1989- 10 November 1990 )
·
ఇతని జన్మస్థలం ఉత్తర
ప్రదేశ్. అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన మొదటి ప్రధాని.
·
అవినీతికి
వ్యతిరేకంగా జనమోర్చా సంస్థను స్థాపించాడు.
·
ఇతను అంతర్
రాష్ట్ర మండలి ఏర్పాటు చేశాడు. అయోధ్య వివాదం బిజెపి తన మద్దతును ఉపసంహరించుకోవడం
వలన తన పదవిని కోల్పోయాడు.
11. చంద్రశేఖర్(10 November 1990- 21 June 1991)
·
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను “బొండ్సి
బాబా”గా పేరుపొందాడు. భారతదేశంలో రాజకీయ పాదయాత్రకు
శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి ఇతనే.
·
1991లో జరిగిన
గల్ఫ్ యుద్ధ కాలంలో అమెరికా యుద్ధ విమానాలకు సరఫరా చేయడం ఎన్నో వివాదాలకు స్థానం
అయింది.
· ఈయన సమాధి పేరు “జననాయక్”
12. పీవీ నరసింహారావు(21 June 1991- 16 May 1996)
·
ఇతను తెలంగాణ
రాష్ట్రానికి చెందిన వ్యక్తి. దక్షిణ
భారతదేశానికి చెందిన తొలి ప్రధాని.
·
ఇతను ఎన్నో
ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. look east అనే విదేశాంగ విధానాన్ని 1992లో ప్రవేశపెట్టడం జరిగింది.
·
LPG అనే నూతన ఆర్థిక
సంస్కరణలను ప్రారంభించారు
·
“దేశ్ బచావో , దేష్ బనావో” అనే నినాదం ఇచ్చాడు.
సత్యనారాయణ రచించిన వెయ్యి పడగలు నవలను సహస్రఫన్ అనే పేరుతో హిందీలోకి తర్జుమా చేశాడు.
·
ఇతను “THE INSIDER” అనే ఆత్మ కథను రాశాడు. ఇతని సమాధి పేరు “జ్ఞానభూమి”. ఇతనికి అపర చాణిక్యుడు, బహుభాషా కోవిదుడు అనే బిరుదులు కలవు.
· పార్లమెంటు ఉభయ సభలలో దేనిలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి. ఇతను తర్వాత నంద్యాల నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.
13. అటల్
బిహారీ వాజ్పేయి- 1996(13 రోజులు)and (1998-99)and (1999-2004)
·
అధిక పార్టీల ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించాడు.
అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయాడు.
·
“జై విజ్ఞాన్” అనే నినాదాన్ని ఇచ్చాడు. 1998లో ప్రోఖ్రాన్ లో
రెండవ సారి అను పరీక్షలు వీరి కాలంలోనే జరిగాయి.
·
కార్గిల్ యుద్ధంని
విజయవంతంగా ఎదుర్కొన్నాడు.
·
ఐక్యరాజ్యసమితిలో
హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని. ఇతనికి 2014లో భారతరత్న అవార్డు లభించింది.
·
2002లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందాడు.
· ఈయన సమాధి పేరు “రాష్ట్రీయ స్మృతిస్థల్”.
14. హెచ్.డి.దేవెగౌడ(1 June 1996- 21 April 1997)
15. I.K గుజ్రాల్ (21 April 1997- 19 March 1998)
·
ఇతను పంజాబ్ రాష్ట్రం లోని జీలం ప్రాంతానికీ చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఇవి పాకిస్తాన్లో ఉంది.
·
గుజ్రాల్ డాక్రిన్ పేరుతో పేరుతో ప్రత్యేక విదేశాంగ విధానాన్ని రూపొందించారు.
· వరల్డ్ స్టేట్ మెన్స్ అనే అవార్డు పొందిన తొలి భారతీయుడు ఇతను.
16. ఏబీ వాజ్పేయి(10 October 1999- 22 May 2004)
17. డాక్టర్ మన్మోహన్ సింగ్(22 May 2004- 26 May 2014)
·
ఇతను పశ్చిమ పంజాబ్ లోని గాహ్ అనే ప్రాంతంలో జన్మించాడు.
ప్రస్తుతం ఇది పాకిస్థాన్ లో ఉంది.
·
అస్సాంలో
రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రధాన
మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఇతను. అమెరికాతో 123 అణు ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి.
·
ఈయన కాలంలో 2005లో సమాచార హక్కు చట్టం, గృహహింస చట్టం, 2006లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. 2009లో
విద్యా హక్కు చట్టాలు అమలులోకి వచ్చాయి.
· పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో ఇతను ఆర్థికమంత్రిగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం.
18. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ(26 May 2014-present)
·
అత్యధిక మెజారిటీతో గెలిచిన రెండవ ప్రధాని ఇతను. గుజరాత్ ముఖ్యమంత్రిగా
4 పర్యాయాలు పనిచేశాడు.
·
ఐక్యరాజ్య సమితి
లో హిందీలో ప్రసంగించిన రెండవ ప్రధాని ఇతను.
·
నరేంద్ర మోడీ 2014 జూన్ 12న తొలిసారి పర్యటించిన విదేశం – భూటాన్.
·
2016
నవంబర్ 8 నాడు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాడు.
·
2017 జులై 1 నుండి GST అమల్లోకి తెచ్చారు. ఇతను భేటీ “బచావో – బేటి పడావో” ఇచ్చాడు.
· ఇతను రెండోసారి ప్రధాని అయిన తరువాత సందర్శించిన తొలిదేశం - మాల్దీవులు
ముఖ్యమంత్రులుగా పని చేసి ప్రధాన మంత్రులు అయిన వారు
·
మురార్జీ దేశాయ్ -బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి
·
చరణ్ సింగ్,V.ప్ సింగ్ -ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
·
పీవీ నరసింహారావు -ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
·
దేవేగౌడ -కర్ణాటక ముఖ్యమంత్రి
· నరేంద్ర దామోదర్ మోడీ- గుజరాత్ ముఖ్యమంత్రి
భారతరత్న బిరుదులు పొందిన ప్రధానమంత్రులు
·
1955 లో జవహర్లాల్
నెహ్రూ
·
1966లో లాల్
బహుదూర్ శాస్త్రి
·
1971లో ఇందిరాగాంధీ
·
1991లో రాజీవ్ గాంధీ,
మురార్జీ దేశాయ్
·
1997లో
గుల్జారీలాల్ నందా
·
2014లో అటల్
బిహారీ వాజ్పేయి
No comments:
Post a Comment