ఢిల్లీ సుల్తానులు - DELHI SULTANATES PDF PART -1
(బానిస వంశం & ఖిల్జీ వంశం)
ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని ఐదు వంశాల వారు పరిపాలించారు. వారు వరుసగా
1. బానిస వంశం
2. ఖిల్జీ వంశం
3. తుగ్లక్ వంశం
4. సయ్యద్ వంశం
5. లోడి వంశం
బానిస వంశం గురించి పూర్తి వివరణ.
· బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. ఇతను తన యజమాని మహమ్మద్ ఘోరీ కి లేకపోవడంతో క్రీ.శ 1206 లో తన స్వతంత్రం ప్రకటించుకొని భారతదేశంలో క్రి.శ.1210 వరకు పరిపాలించాడు.
· ఇతని వారసులలో ఇల్ టూబ్ మిష్, రజియా సుల్తానా, బాల్బన్ లు ప్రముఖులు.
· బానిస వంశ వృక్షం.
1. కుతుబుద్దీన్ ఐబక్ (1206-10)
2. ఆరాం శా. (1210-11)
3. ఇల్ టుబ్ మీష్. (1211-36)
4. ఫిరోజ్ షా. (1236)
5. రజియా సుల్తానా. . (1236-40)
6. భాహరం శా. (1240-43)
7. మసూద్ సా. (1243-45)
8. నసీరుద్దీన్ మహమ్మద్(1245-65)
9. బాల్బన్. (1266-87)
10.కైకుబాద్ (1287-90)
1. కుతుబుద్దీన్ ఐబక్:-
· అతను మొదట మహమ్మద్ ఘోరి వద్ద సేనానిగా లేదా బానిస గా ఉండేవాడు.
· ఇతను క్రి. శ. 1206 లో ఢిల్లీ స్వతంత్ర సామ్రాజ్య స్థాపన చేసుకున్నాడు. ఢిల్లీ ఆక్రమించిన అందుకు గుర్తుగా కువ్వట్ ఉల్ ఇస్లాం అనే మసీదును నిర్మించాడు. ఈ మసీదులోని గోడలపై ఖురాన్ లోని శ్లోకాలు రచించబడినవి.
· ఇతడు అజ్మీర్ నగరంలో “అర్హదిన్ జంప్ర మసీద్ను నిర్మించాడు.
· ఇతను లాహోర్ నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు మరియు u2 రాజధానిగా ఢిల్లీని ప్రకటించాడు (ఢిల్లీని పూర్తి రాజధానిగా చేసినది ఇల్ టబ్ మిశ్.)
· తన గురువు అయిన భక్తియార్ అనే పండితుడు పేరు మీదగా కుతుబ్మినార్ నిర్మాణాన్ని చేపట్టాడు.
· కుతుబ్మినార్ మరొక పేరు” మినార్ -ఈ- షంషేర్”.
· ఇతనికి గల బిరుదులు
1. లాక్ బాక్ష్
2. ఐబక్
· ఇతని కుమార్తెను తన బానిస అయినా ఇల్టుట్మిష్ కు ఇచ్చి వివాహం చేశాడు.
· ఇతడు లాహోర్ నగరంలో పోలో ఆట ఆడుతు గుర్రం మీద నుండి పడి మరణించాడు.
2. ఆరం షా.
· కుతుబుద్దీన్ ఐబక్ మరణాంతరం ఆరం షా చక్రవర్తి అయినాడు.
· ఆరం షా ను వధించినవాడు ఇల్ టబ్ మిష్.
3.ఇల్ టబ్ మీశ్.
· ఇల్ టబ్ మీశ్ ఆ రాంషా నో వధించి క్రీ.శ 1200 11లో చక్రవర్తి అయ్యాడు.
· ఇతను కుతుబుద్దీన్ ఐబక్ వద్ద బానిసగా ఉండేవాడు.
· అతను ఇల్బారి ఈ తెగకు చెందిన వాడు.
· ఇతను ఢిల్లీ ని పూర్తిగా రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.
· ఇతను ఖలీఫా ఆశీస్సులు స్వీకరించిన మొట్టమొదటి భారతీయ ముస్లిం చక్రవర్తి.
· ఇతని కాలంలోనే 40 మంది సభ్యుల వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది.
· ఇతను ముఖ్యంగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యంలో ఇక్తా అనే సైనిక విధానాన్ని ప్రవేశపెట్టాడు.
· ఇతను కుతుబ్మినార్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు.
· ఇతను టంకా అనే వెండి నాణేలను జిటల్ రాగి నాణాలను ప్రవేశపెట్టాడు.
· ఇతడు ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయాన్ని ధ్వంసం చేశాడు.
· ఇతని కుమార్తె రజియా సుల్తానా ను పాలకురాలిగా ప్రకటించి మరణించాడు.
· అతని సమాధి ఢిల్లీ లో కలదు.
4. రజియా సుల్తానా.
· రజియా సుల్తానా ఫిరోజ్ షా ను వధించి 1236 లో పాలకురాలిగ ప్రకటించుకుంది.
· ఈమె భారత దేశ చరిత్రలో మొదటి స్త్రీ పరి పాలకురాలు.
· ఈమె మాలిక్ జమాలుద్దీన్ యాకుత్ అనే అభిసినియా దేశస్తున్ని అశ్వదలాధిపతిగా నియమించింది.
· ఇది నచ్చని సామంతులు ఈవిడ పై ఎన్నో తిరుగుబాటు చేశారు అవన్నీ కూడా ఈవిడ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
· ఈవిడ భర్త ఆల్ తునియా.
· రజియా సుల్తానా తన సోదరుడైన బహిరం షా చేతిలో ఓడించబడి 1240 అక్టోబర్ 13న అనే అటవీ ప్రాంతంలో దారి దోపిడీ దొంగల చేతిలో హత్య చేయబడింది.
5. నసీరుద్దీన్ మహమ్మద్.
· ఇతనికి ముందుగా బహారం షా , మసూద్ షా లు చక్రవర్తులుగా ఉంటే చిహల్ గని వ్యవస్థ వారు వీరిని తొలగించారు.
· నసిరుద్దీన్ తన కుమార్తెను బాల్బన్ కు ఇచ్చి వివాహం చేశాడు.
· సిరాజ్ అనే పండితుడు “తబకథ్ ఈ నాసిరి”అనే గ్రంథాన్ని నసిరుద్దీన్ పేరు మీదుగా రచించాడు.
6. బాల్బాన్.
· బానిస వంశ పాలకులలో గొప్పవాడు బాల్బన్.
· బాల్బన్ ఒక బానిసగా, నీటి సంచులు మోసే కూలీగా, వేట అధికారిగా, సేనాధిపతిగా, రాజనీతిజ్ఞుడిగా, చివరికి సుల్తాన్ గా ఎదిగాడు. అని ప్రముఖ చరిత్రకారుడు లేన్ పూలే గారు పేర్కొన్నారు.
· ఇతను దైవ దత్త అధికార సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు.
· ఇతను ఇరాన్ దేశ పద్ధతులను భారత్లో ప్రవేశపెట్టాడు.
i. సిజ్లా-చక్రవర్తికి సాష్టాంగ నమస్కారం చేయడం
ii. పైబోజ్-చక్రవర్తి పాదాన్ని ముద్దాడడం.
iii. జుంబోజ్-చక్రవర్తి చేతివేళ్ళు లేదా సింహాసనాన్ని ముద్దాడడం.
· ఇతను ప్రవేశపెట్టిన పండగ-నౌరొజ్ పండగ.
· ఇతను 40 మంది చిహాల్ గని సభ్యులను వధించి నాడు.
· బాల్బన్ చాంబరలీన్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టిన నాడు.
· అతడు దివాన్ ఈ విజరత్ అనే ఆర్థిక శాఖను ఏర్పాటు చేశాడు.
· ఇతని కాలంలో పలుమార్లు భారతదేశంపై దండెత్తిన వారు మంగోలులు ఆ మంగోలుల తరిమికొట్టిన బాల్బన్ పెద్దకొడుకు మహమ్మద్ మంగోలుల నాయకుడైన తైమూర్ ఖాన్ చేతి లో మరణించినాడు.
· బాల్బన్ మరణాంతరం కైకుబాద్ చక్రవర్తి అయినాడు. కైకుబాద్ బాల్బన్ యొక్క మనవడు.
· కైకుబాద్ ను అతని కుమారుడైన ఖయ్యూమార్స్ నీ వధించినవాడు జలాలుద్దీన్ ఖిల్జీ.
· ఇంతటితో బానిస వంశం యొక్క శకం ముగిసింది.
ఖిల్జి వంశం గురించి పూర్తి వివరణ
· ఖీల్జి వంశ వృక్షం
1. జలాలుద్దీన్ ఖిల్జీ
2. అల్లాఉద్దీన్ ఖిల్జీ
1. జలాలుద్దీన్ ఖిల్జీ (1290-1320)
· ఇతను ఈ వంశ స్థాపకుడు.
· ఇతడు కారా రాష్ట్ర పరిపాలకుడైన మాలిక్ చజ్జుని ఓడించాడు.
· ఇతను సిద్ధిమౌల అనే మత గురువును సజీవ దహనం చేసి వధించాడు.
· తన సోదరుని కుమారుడు-అల్లాఉద్దీన్ ఖిల్జీ
· జలాలుద్దీన్ ఖిల్జీ తన కుమార్తెను అల్లా ఉద్దీన్ ఖిల్జీ కి ఇచ్చి వివాహం చేసి అయోధ్య మరియు కాల రాష్ట్రాలను ఇచ్చినాడు.
· అల్లావుద్దీన్ హిందీ యాదవ రాజ్యంపై దండెత్తి రామచంద్ర దేవుడిని ఓడించి అనేక ధనరాశులను దోచుకుని కుట్రల ద్వారా జలాలుద్దీన్ ను వధించినాడు.
2. అల్లాఉద్దీన్ కిల్జి
· ఇతను ఒక నిరక్షరాస్య డు
· ఇతని సేనాధిపతులు
1. జాఫర్ ఖాన్
2. ఆల్ఫా ఖాన్
3. నస్రత్ ఖాన్
4. ఉల్ఫ్ ఖాన్
5. మాలిక్ కపూర్
· అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆదర్శప్రియుడు షేర్ షా.
· అల్లా ఉద్దీన్ ఖిల్జీ నీ ఆదర్శంగా తీసుకున్న వారు అక్బర్.
· ఇక్తా వ్యవస్థను రద్దుచేసి 495000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
· ప్రతి సైనికునికి 234 వెండి టంకాల జీవితాన్ని ఇచ్చాడు.
· సైన్యంలో జరిగే మోసాలను అరికట్టడానికి ఖిల్జీ దాగ్ మరియు చేహర వ్యవస్థను ప్రవేశ పెట్టిన వాడు.
· బాగ్ అనగా గుర్రాలపై ముద్రలు వేసే పద్ధతి
· సహారా అనగా సైనికుల ఆన వాళ్లతో కూడిన పట్టికను తయారు చేయడం.
· ఇతను అమీర్ ఖుస్రో అనే పండితుడిని ఆదరించాడు.
· అమీర్ ఖుస్రో యొక్క బిరుదు ప్యారెట్ ఆఫ్ ఇండియా.
· అమీర్ ఖుస్రో తారక్ -ఈ- అలై అనే గ్రంధాన్ని రచించాడు.
· అమీర్ ఖుస్రో సితార్, తబలా, సారంగి లాంటి ఇ సంగీత పరికరాలను కనుగొన్నాడు.
· అల్లావుద్దీన్ కిల్జీ యొక్క బిరుదు రెండవ అలెగ్జాండర్ మరియు సికిందర్ -ఇ- సని.
· ఇతను గుజరాతి పై దండెత్తి కర్ణ దేవుని ఓడించి అతని భార్య కమలాదేవి వివాహం చేసుకున్నాడు.
· అల్లాఉద్దీన్ ఖిల్జీ కుమారుడు ఖజిర్ ఖాన్ కర్ణ దేవుని కుమార్తెను ప్రేమించాడు.
· 1303 లో చిత్తోజ్ పై దండెత్తి చిత్తూరు చక్రవర్తి అయిన రతన్ సింగ్ ను ఓడించి అతని భార్య పద్మిని (జగదేక సుందరి) ను వివాహం చేసుకుందామని అనుకున్నాడు.కానీ పద్మిని జౌహార్ చేసుకుని మరణించింది.
· అల్లావుద్దీన్ 1311 లో ఢిల్లీలో అలై దర్వాజ ను నిర్మించాడు ఈ కట్టడం తెలుపు ఎరుపు పాలరాతితో నిర్మించబడినది.
· అల్లాఉద్దీన్ ఖిల్జీ రణ తంబోర్ పై చక్రవర్తి అయిన హరిహర దేవుడిని వధించి రణతంబోర్ ని ఆక్రమించాడు.
· అల్లావుద్దీన్ ఖిల్జి దక్షిణ భారతదేశంపై దండయాత్ర.
· దక్షిణ భారతదేశ దండయాత్రకు నాయకుడు-మాలిక్ కపూర్.
· వీరు యాదవ రాజ్యంపై దండెత్తి యాదవ చక్రవర్తి అయినా రామచంద్ర దేవుడిని వధించి దేవలదేవిని యువరాజ్ అయినా కజిర్ ఖాన్ వివాహం చేసుకున్నాడు.
· కాకతీయ రాజ్యంపై దండెత్తి అక్కడ రెండవ ప్రతాపరుద్రుని ఓడించి మాలిక్ కపూర్ కప్పం వసూలు చేసినాడు.
· పాండే రాజ్యంపై దండెత్తి సుందర పాండ్యడు తో ఒప్పందం చేసుకుని వీరపాండ్యని పై యుద్ధం చేసి ఓడించారు.
· హోయసల రాజ్యంపై దండెత్తి మాలిక్ కపూర్ మూడవ వీరమల్లు డి ఓడించి కప్పం వసూలు చేశాడు.
· యాదవ రాజ్యం లో రామచంద్రుని దేవుని మరణాంతరం శంకర దేవుడు చక్రవర్తి అల్లా ఉద్దీన్ ఖిల్జీ కి కప్పం చెల్లించడం మానేశాడు.
· మాలిక్ కపూర్ శంకర దేవుని ఓడించి యాదవ రాజ్యాన్ని ఆక్రమించాడు.
· అల్లాఉద్దీన్ ఖిల్జీ రాజ్యంలో కలిసిన ఏకైక దక్షిణ భారతదేశ రాజ్యం-యాదవ రాజ్యం.
· అల్లావుద్దీన్ కు విష ప్రయోగం చేసి చంపి అతని భార్య ను వివాహం చేసుకున్న వాడు మాలిక్ కపూర్.
· యువరాజ్ అయినా కాజిర్ ఖాన్ వధించినవాడు ముబారక్ ఖాన్.
· ముబారక్ ఖాన్ ను వధించి చక్రవర్తి అయిన వాడు – ఖుసృషా.
· ఖుసృశా ను వధించినవాడు -గియాసుద్దీన్ తుగ్లక్.
No comments:
Post a Comment